English | Telugu

అఫీషియల్.. దసరా బరిలో 'NBK 108'

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'NBK 108'(వర్కింగ్ టైటిల్). షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి విజయాల తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 108'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది దసరాకు విడుదలయ్యే అవకాశముందని కొంతకాలంగా న్యూస్ వినిపిస్తోంది. తాజాగా మేకర్స్ ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

దసరాకు 'NBK 108' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ 'విజయదశమికి ఆయుధపూజ' పేరుతో మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. అయితే తేదీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే దసరా బరిలో రెండు సినిమాలు ఉన్నాయి. రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'తో పాటు, రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా అక్టోబర్ 20న విడుదల కానున్నాయి. ఇప్పుడు 'NBK 108' కూడా దసరా రేసులోకి అధికారికంగా వచ్చేసింది. దసరా హాలిడేస్ ని క్యాష్ చేసుకునేలా ఈ మూవీ అక్టోబర్ 20 కంటే కాస్త ముందుగానే విడుదలయ్యే అవకాశముంది. సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని త్వరలోనే రివీల్ చేయనున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.