English | Telugu

నయనతారా... ఈ ఎక్స్‌పోజింగ్‌ దాని కోసమేనా?

హీరోయిన్లు ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయి. హీరోయిన్ల కెరీర్‌ ఎక్కువ సంవత్సరాలు కొనసాగే అవకాశం తక్కువ. కానీ, ఈమధ్యకాలంలో కొందరు హీరోయిన్లు సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. వారిలో నయనతార ఒకరు. 2003లో ఓ మలయాళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నయనతార హీరోయిన్‌గా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సౌత్‌లో నంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్న నయన్‌ దృష్టి బాలీవుడ్‌పై పడిరది.

ఇటీవల షారూఖ్‌ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమాలో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, దీపికాపదుకొనే హీరోయిన్‌ అనిపించేలా వుందని నయన్‌ ఆమధ్య కామెంట్స్‌ చేసింది. అయితే బాలీవుడ్‌పై ఆమెకు మమకారం తగ్గలేదని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. హీరోయిన్లు తమ పాపులారిటీ పెంచుకునేందుకు సాధారణంగా ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్స్‌ కోసం ఫోటో షూట్స్‌ చేస్తుంటారు. అయితే ఈ ఫోటోలు ఎక్కువ శాతం ఎక్స్‌పోజింగ్‌తోనే ఉంటాయి. నయనతార చేసిన సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌ తక్కువనే చెప్పాలి. ఆమె కెరీర్‌ ప్రారంభంలో వచ్చిన బిల్లా వంటి సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌ బాగా చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎక్స్‌పోజింగ్‌ చెయ్యాల్సిన అవసరం రాలేదు. హుందాతనంతో కూడుకున్న క్యారెక్టర్స్‌ చేస్తూ ఉండడంతో ఆమెను ఆ దృష్టితో ఎవరూ చూడడం లేదు. ఇప్పుడు తనకూ ఎక్స్‌పోజింగ్‌ అవసరం అన్నట్టుగా ఓ ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ కోసం సెక్సీ ఫోజులిచ్చింది. ఏమిటి.. నయన్‌ మనసు మార్చుకుందా, అందాల ప్రదర్శనపై మనసు పడిరదా అంటూ కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

‘జవాన్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వడంతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని, అందుకే మళ్ళీ ఎక్స్‌పోజింగ్‌ వైపు వెళ్లిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్‌లో తన అందాల్ని మరోసారి ఫోటోల రూపంలో అందరికీ పంచుతోంది. బాలీవుడ్‌ను ఆకర్షించేందుకే నయన్‌ ఈ ప్రయత్నాలు చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లు కూడా ఇదే కామెంట్స్‌ చేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.