English | Telugu

ఊహించని జోడీ వస్తోందా?

స్క్రీన్ పై అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్స్ మెరుస్తుంటాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ ఒకటి రానున్నట్టు టాక్. ఇంతకీ ఎవరంటారా? నాని-కాజల్. మహేశ్ బాబుతో ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ తాజాగా నానితో ఓ మూవీ ప్లాన్ చేసుకుంది. హను రాఘవపూడి దర్శకుడు. ఈ చిత్రంలో కొద్దిమంది పిల్లలతో పాటూ కథానాయిక పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉందట. అందుకే కొత్త భామ కన్నా...కాస్త విషయం ఉన్న పిల్లని తీసుకుంటే బెస్టని డిసైడయ్యారట.

నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కాబట్టి కాజల్ అయితే సరిపోతుందనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఆరంభంలో కాజల్ అయితే క్యూట్ గా చందమామలా చల్లగా ఉంది. కానీ ఇప్పుడు అమ్మడు ముదిరిపోయింది కదా...కుర్రాడిలా కనిపించే నాని పక్కన సెట్టవుతుందంటారా? అనే డిస్కషన్స్ జోరందుకున్నాయి. నాని-కాజల్ జోడీ దమ్ములో ఎన్టీఆర్-త్రిష లా విమర్శలు ఎదుర్కొంటుందేమో అంటున్నారు. అయితే నటనలో ఇద్దరూ ఇద్దరే కాబట్టి లుక్ తో కాకుండా యాక్షన్ తో మెప్పిస్తారేమో మరి!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.