English | Telugu

 నా మీద కొన్ని మీడియా సంస్థల కుట్ర.. హీరో నాని ఆరోపణ 

ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగిన నటుడు నాని. తన నాచురల్ స్టార్ అనే బిరుదుకి తగ్గట్టే ఆయన సినిమాలు కూడా అంతే నాచురల్ గా ఉంటాయి. ఆయన వ్యక్తిత్వం కూడా నాచురల్ గానే ఉంటుంది. నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ అందరు ప్లాన్ చేసుకొని మరి నాని సినిమా చూడటానికి థియేటర్లకి క్యూ కడతారు. ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉండే నాని ఇటీవల తన మీద వచ్చిన కొన్ని ఆరోపణలకి చాలా నాచురల్ గా క్లారిఫై ఇచ్చాడు.

హైదరాబాద్ లో ఇండియా టుడే వాళ్ళు ఏర్పాటు చేసిన తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశంలో నాని పాల్గొన్నాడు. ఈ సమావేశంలో నాని మాట్లాడుతూ జాతీయ అవార్డుల్ని ప్రకటించిన సమయంలో నేను మన తెలుగు వాళ్ళకి అవార్డులు వచ్చినందుకు బాధగా ఉన్నాననే ఒక రూమర్ ని కొన్ని మీడియా సంస్థలు క్రియేట్ చేసాయి. జాతీయ అవార్డులు ప్రకటించిన సమయం లో నేను ఏమి అన్నానో మరో సారి మీకు గుర్తుచేస్తున్నాను అని తను ఏమని అన్నాడో మరోసారి చెప్పుకొచ్చాడు.
జాతీయ అవార్డులలో జై భీమ్ సినిమాకి ఎలాంటి అవార్డు దక్కకపోవడంతో నా బాధని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసాను. అలాగే అదే సమయంలో జాతీయ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్, పుష్ప మరియు ఉప్పెన టీమ్‌లను కూడా అభినదించాను. అలాగే ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా నిలిచినందుకు నా సోదరుడు అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియచేసాను. కానీ కొన్ని మీడియా సంస్థలు తెలుగు వాళ్ళకి దక్కిన అవార్డుల విషయంలో నేను సంతోషంగా లేనని వక్రీకరించి రాశాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను .మా చెల్లి ఒక ఘనత సాధించి నా పక్కింటి కజిన్ ఏమి సాధించలేకపోయిందని అనుకుందాం. నేను నా చెల్లి కోసం నా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను బట్ అదే సమయంలో నా కజిన్ గురించి కూడా బాధపడతాను కదా అని చెప్పాడు.

కాకపోతే జై భీమ్ లాంటి అత్యుత్తమ చిత్రానికి జాతీయ స్థాయిలో ఒక అవార్డు అయినా వచ్చి ఉంటే అలాంటి సినిమాలుని మరింత మంది చెయ్యడానికి ప్రోత్సాహకరంగా ఉండేది అని చెప్పాడు. నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు. మృణాల్ ఠాకూర్ నాని సరసన హీరోయిన్ గాచేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8 న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.