English | Telugu

నీకు నిద్ర పడుతుందా అన్నా!.. నాగవంశీ ట్రోల్స్ 

సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత' ప్రముఖ నిర్మాత 'నాగవంశీ'(Naga Vamsi)కి సినీ సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంది. తన కొత్త చిత్రాల రిలీజ్ టైంలో మీడియా సమక్షంగా నాగవంశీ వేసే ప్రశ్నలు, చెప్పే సమాధానాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో నాగవంశీ కి పెద్ద ఫాలోయింగ్ ఉంది. ట్రోల్ల్స్ కూడా ఒక రేంజ్ లోనే జరుగుతుంటాయి.

రీసెంట్ గా సోషల్ మీడియాలో నాగవంశీ పై మరో ట్రోల్ జరుగుతుంది. 'వార్ 2 ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ మాట్లాడుతు 'వార్ 2’(War 2)ని హిట్ చేసే బాధ్యత ఎన్టీఆర్ అభిమానులదే. ఫస్ట్ డే హిందీ కంటే తెలుగులో ఒక్క రూపాయైనా ఎక్కువ వచ్చేలా చేయాలని మాట్లాడాడు. కానీ వార్ 2 కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో గతంలో పుష్ప 2 రిలీజ్ టైంలో ఒక ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతు నార్త్‌లో పుష్ప 2 ఒకే రోజు 80 కోట్లు వసూలు చేస్తే బాలీవుడ్ నిద్రపోదని చెప్పాడు. ఇప్పుడు బాలీవుడ్ నుండి వచ్చిన వార్ 2కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు లేకపోవడంతో, నెటిజన్లు పుష్ప నాటి మాటలను గుర్తు చేస్తు వార్ 2కి కలెక్షన్లు రావడం లేదు కదా నీకు నిద్ర పడుతుందా అన్నా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్(Ntr),హృతిక్(Hrithik Roshan)ల 'వార్ 2 'ని 'నాగవంశీ' తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసాడు. సదరు హక్కులని 80 కోట్ల రూపాయలకి దక్కించుకున్నట్టు సినీ సర్కిల్స్ లో టాక్.

లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ తో వరుస విజయాల్ని అందుకున్న నాగవంశీ రీసెంట్ గా 'విజయ్ దేవరకొండ' తో నిర్మించిన 'కింగ్ డమ్'(Kingdom)తో ప్లాప్ ని అందుకున్నాడు. మాస్ మహారాజ రవితేజతో చేసిన ‘మాస్ జాతర’(Mass Jathara)ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.