English | Telugu

పదేళ్ళ తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్..!

'టెంపర్'కి ముందు ఎన్టీఆర్ వేరు.. 'టెంపర్' తర్వాత ఎన్టీఆర్ వేరు. 2015లో వచ్చిన 'టెంపర్' మొదలుకొని, 2024లో వచ్చిన 'దేవర' వరకు.. ఏడు సినిమాలు చేశాడు ఎన్టీఆర్. అందులో ఒక్క పరాజయం కూడా లేదు. ఇటీవల కాలంలో ఇలా వరుసగా ఏడు విజయాలు అందుకున్న స్టార్స్ ఎవరూ లేరనే చెప్పాలి. అంతటి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ కి ఇప్పుడు 'వార్-2' రూపంలో ఊహించని షాక్ తగిలింది.

ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ మొదటి వీకెండ్ లో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. అయితే ఎన్టీఆర్-హృతిక్ కాంబోకి, ఆ బడ్జెట్ కి ఈ కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'వార్-2' ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయట్లేదు.

'వార్-2' తెలుగు థియేట్రికల్ రైట్స్ ని నిర్మాత నాగవంశీ దాదాపు రూ.80 కోట్లకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. రూ.50 కోట్ల లోపు షేర్ కే పరిమితమవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే భారీ నష్టాలు తప్పవు. మరి 'వార్-2' తెలుగునాట అనూహ్యంగా పుంజుకొని హిట్ అనిపించుకుంటుందో లేక పదేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్ పడేలా చేస్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.