English | Telugu

డిసెంబర్ 1న సడెన్ ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య!

అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన గత రెండు చిత్రాలు 'థ్యాంక్యూ', 'కస్టడీ' నిరాశపరిచాయి. దీంతో ఓ మంచి విజయంతో హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు చైతన్య. ప్రస్తుతం తన 23వ సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కంటే ముందే ఈ ఏడాదిలోనే చైతన్య ప్రేక్షకులను పలకరించనున్నాడు. అయితే అది సినిమా కాదు.. వెబ్ సిరీస్.

గతేడాది 'దూత' అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు చైతన్య ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ గురించి కొంతకాలంగా ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే సడెన్ గా ఇప్పుడు ఈ సిరీస్ స్ట్రీమింగ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట. మొత్తం 8 ఎపిసోడ్ లు ఉంటాయని, ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమషాల వంతున ఉంటుందని సమాచారం.

చైతన్య, విక్రమ్ కాంబినేషన్ లో గతంలో 'మనం', 'థ్యాంక్యూ' సినిమాలు వచ్చాయి. అందులో మనం ఘన విజయం సాధించగా, థ్యాంక్యూ పరాజయం పాలైంది. మరి ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న సిరీస్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.