English | Telugu

ముమైత్.. 22 రోజుల్లో ఏం చేస్తుంది?


టాప్ హీరోయిన్ ల సంగతి ఏమో కానీ ఒక మోస్తారు హీరోయిన్ లు అయితే ఒకటి రెండు సినిమాలు తీసి బిస్తరు సర్దేస్తారు. కాని ఏదో ఒక రకంగా జనాల నోళ్లలో నానడానికి మాత్రం అప్పుడప్పుడు మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇక వాళ్లు ఏదనుకుంటే అది చేస్తారు. ఇప్పుడు అదే తరహాలో ఐటెం క్వీన్ ముమైత్ ఖాన్ ఓ ప్లాన్ వేసిందట.

పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాటతో ఒక్కసారిగా ఐటెం క్వీన్ గా మారిపోయిన ముమైత్ ఖాన్ తరువాత చాలా కాలం తన ఐటెం పాటలతో టాలీవుడ్ ను ఏలింది. అయితే ఇప్పుడు కాస్త అమ్మడు జోరు తగ్గిందనే చెప్పుకోవచ్చు. చేతిలో సినిమాలు లేక ఖాళీగానే సమయాన్ని టైమ్ పాస్ చేస్తోంది. కానీ మరీ ఇలానే ఉంటే అందరూ తనని మర్చిపోతారని అనుకుందేమో ఈ భామ ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసింది. 22రోజుల పాటు సాగే ఈ ట్రిప్ లో మొత్తం 1000 మైళ్లు ప్రయాణిస్తుందట. అంతేకాదు మ్యూజిక్ డ్యాన్సింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఇలా దారిపొడవునా ఎంతో హుషారుగా ఉంటుందని కూడా చెప్పుకొస్తుంది. మధ్యలో మ్యూజిక్ ఫెస్టివల్స్ లో స్నేహితుల్ని కూడా కలుస్తుందట ముమైత్. మొత్తానికి కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు మరి ముమైత్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. చూద్దాం..

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.