English | Telugu

లవర్ పేరు చెప్పిన సీతా రామం హీరోయిన్ మృణాళిని

భారతీయ చిత్ర పరిశ్రమలో తాము నటించిన మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లు అయిపోయిన నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే తాము నటించిన సినిమాలో తన అందం తో పాటు నటనకి అవకాశం ఉన్న పాత్ర దొరికినప్పుడే అలా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోవడమే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో తన రూపం చెరిగిపోని విధంగా గుర్తుండేలా చేసుకుంటుంది. అలా ఒకే సినిమాతో తెలుగు ప్రేక్షుకుల గుండెల్లో గుర్తుండిపోయిన నటి మృణాళిని ఠాకూర్ ఇప్పుడు ఈ భామ తన లవర్ గురించి చెప్పి తన అభిమానులని షాక్ కి గురి చేసింది.
గత సంవత్సరం వచ్చిన సీతారామం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన మృణాళిని ఆ సినిమా ద్వారా లక్షల మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ మూవీ లో తను ప్రదర్శించిన నటనకి అలాగే తన అందానికి తెలుగు ప్రేక్షకులు ధాసోహమయిపోయారు. సీత పాత్రలో మృణాళిని చాలా అద్భుతంగా నటించింది. ఉత్తరాదికి చెందిన ఈ భామ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే రోజుల్లో ఫుల్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తను నాచురల్ స్టార్ నాని తో ఒక మూవీ చేస్తుంది. ఆ మూవీ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. మెగాస్టార్ అప్ కింగ్ మూవీలో కూడా మృణాళిని హీరోయిన్ గా చేస్తుందనే టాక్ వినబడుతుంది. అదే జరిగితే మృణాళిని టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం.
ఆ విషయాలన్నీ అలా ఉంచితే మృణాళిని తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నేను ప్రముఖ హాలీవుడ్ హీరో కీని రీవ్స్ ని లవ్ చేసానని చిన్నపడే ఒక సినిమాలో చూసి కీని లవ్ చేసానని కానీ అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయిందని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె అభిమానులు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అసలికేమృణాళిని ని తమ హృదయ దేవతగా కొలిచే అభిమానులు మృణాళిని కనుక తనకి ఇప్పుడు లవర్ ఉన్నాడని చెప్పి ఆ లవర్ ని మీడియా ముందుకు తిసుకోచ్చిందంటే మాత్రం ఆమె అభిమానులు తట్టుకోలేరు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.