English | Telugu

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' రెండు వారాల కలెక్షన్స్..  ఎంత రాబట్టిందో తెలుసా!


'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మళ్ళీ అభిమానులను పలకరించిన అనుష్కకి.. మంచి ఫలితమే దక్కింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ.. అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ ముంగిట బ్లాక్ బస్టర్ స్టేటస్ పొందింది. సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన ఈ సినిమా.. బుధవారంతో 14 రోజుల (2 వారాలు) ప్రదర్శన పూర్తిచేసుకుంది. రూ. 13.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన శెట్టి అండ్ శెట్టి.. ఈ 14 రోజుల్లో రూ. 22.52 కోట్ల షేర్ రాబట్టింది. అంటే.. ఓవరాల్ గా రూ. 9.02 కోట్ల లాభం చూసిందన్నమాట.



'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 14 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 6.96 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 1.18 కోట్ల షేర్
ఆంధ్రా: రూ. 4.75 కోట్ల షేర్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.12.89 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.74 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.7.89 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల కలెక్షన్స్ : రూ.22.52 కోట్ల షేర్ (రూ. 43.50 కోట్ల గ్రాస్)

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.