English | Telugu

లిటిల్ హార్ట్స్ కి మిరాయ్ స్ట్రోక్! 

యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్, ఫాంటసీ జోనర్ లో తెరకెక్కిన 'మిరాయ్'(Mirai)నిన్నవరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా ప్రస్తుత కాలానికి, మన పురాణ ఇతిహాసాల్ని ముడిపెడుతు 'మిరాయ్' తెరకెక్కింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ తో పాటు, 24 క్రాఫ్ట్స్ పనితనం మెస్మరైజ్ చెయ్యడంతో, ఒక కొత్త అనుభూతిని పొందుతున్నామనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. దీంతో 'మిరాయ్' భారీ కలెక్షన్స్ ని రాబడుతుందనే వ్యాఖ్యలు సినీ ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ఈ ప్రభావం 'లిటిల్ హార్ట్స్'(Little Hearts)పై పడే అవకాశం ఉందనే చర్చ కూడా సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. లిటిల్ హార్ట్స్ చిన్న చిత్రంగా విడుదలై మౌత్ టాక్ తో రోజు రోజుకి మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇందుకు ఆ చిత్రం తొలి రోజు నుంచి సాధిస్తున్న కలెక్షన్స్ లే ఉదాహరణ. ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుండటంతో చాలా ఏరియాల్లో థియేటర్స్ సంఖ్య కూడా పెంచారు. దీంతో ఎవరి ఊహలకి అందుకొని విధంగా రికార్డు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని అందరు భావించారు. కానీ ఇప్పుడు 'మిరాయ్' థియేటర్స్ లో అడుగుపెట్టింది. మౌత్ టాక్ పాజిటివ్ వస్తుండంతో ప్రేక్షకులు థియేటర్స్ కి పోటెత్తుతున్నారు. ప్రేక్షకుల డిమాండ్ తో ఈ రోజు నుంచి ఐదు షో లు కూడా ప్రదర్శిస్తున్నారు.

అందుకు తగ్గట్టే ఆన్ లైన్ బుకింగ్ కూడా చాలా ఏరియాల్లో ఫుల్ అయ్యాయి. వీకండ్ కావడంతో ప్రేక్షకులు లిటిల్ హార్ట్స్ కి వెళ్లే వాళ్ళని, ఇప్పుడు 'మిరాయ్' ప్రేక్షకుల ముందు కనపడుతుందనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో లిటిల్ హార్ట్స్ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.