English | Telugu

ఇప్పుడు మరింత కొత్తగా ‘మిరాయ్‌’.. సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ వచ్చేసింది!

తేజ సజ్జ, కార్తీక్‌ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్‌ మూవీ ‘మిరాయ్‌’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రిలీజ్‌కి ముందే ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీని క్రియేట్‌ చేసిన ఈ సినిమా అందరి అంచనాలకు రీచ్‌ అయింది. ‘హనుమాన్‌’ తర్వాత తేజ సజ్జ కెరీర్‌లో మరో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలుస్తోంది. వీకెండ్‌తో సంబంధం లేకుండా అన్ని రోజులూ కలెక్షన్స్‌ రాబడుతున్న ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో హీరోతో సమానంగా మంచు మనోజ్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసిన విధానం అందరికీ నచ్చింది. దానికి తగ్గట్టుగానే పెర్‌ఫార్మెన్స్‌ ఉండడంతో అతనికి మంచి అప్రిషియేషన్‌ వస్తోంది. ఇక హరి గౌర సాంగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

లీజ్‌కి ముందే ఈ సినిమాలోని ‘వైబ్‌..’ సాంగ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఈ పాట సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్‌ చాలా నిరాశకు లోనయ్యారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ అయినప్పటికీ ఆ పాట లేని లోటు ప్రేక్షకులు ఫీల్‌ అయ్యారు. దీంతో మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేక్షకులు, తేజ అభిమానులు. ఈ పాటను యాడ్‌ చెయ్యాలనే డిమాండ్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 23 నుంచి అన్ని సెంటర్స్‌లో ఈ పాటను జత చేశారు. ఈ పాట కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు ఇది సంతోషాన్ని కలిగించే విషయమే. ఈ పాట కోసమే ఈ సినిమాకు రిపీట్‌ ఆడియన్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 134 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన ‘మిరాయ్‌’.. లాంగ్‌ రన్‌లో ఎలాంటి ఫిగర్స్‌ని రీచ్‌ అవుతుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.