English | Telugu

షాక్ ల మీద షాక్ లు.. ఓజీ షోలు క్యాన్సిల్!

నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకి బిగ్ షాక్ తగిలింది. కెనడాలోని మేజర్ చైన్స్ లో ఒకటైన యార్క్ సినిమాస్.. ఓజీ చిత్రాన్ని ప్రదర్శించబోమని ప్రకటించింది. అంతేకాదు, నార్త్ అమెరికాలో ఓజీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసింది. (They Call Him OG)

"ఓజీ చిత్రానికి సంబంధించిన అన్ని షోలను క్యాన్సిల్ చేశామని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఈ సినిమా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ విషయంలో కల్చరల్, పొలిటికల్ వర్గాలకు సంబంధముంది. దీని వల్ల ప్రేక్షకుల భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులు, ఉద్యోగుల భద్రత మా ప్రథమ కర్తవ్యం. అందుకే ఓజీ సినిమాని ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నాం. టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న ప్రేక్షకులకు పూర్తి రీఫండ్ ఇవ్వబడుతుంది.

నార్త్ అమెరికా ఓజీ డిస్ట్రిబ్యూటర్‌ తరఫు వ్యక్తులు కొందరు.. గతంలో టికెట్ సేల్స్ సంఖ్యను ఎక్కువ చేసి చూపించమని రిక్వెస్ట్ చేశారు. భవిష్యత్ లో విడుదలయ్యే దక్షిణాసియా సినిమాల వాల్యూ పెంచేందుకు వారు ఇలా చేస్తున్నారు. నార్త్ అమెరికాలోని సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీపై పూర్తి ఆధిపత్యం కోసం ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. అంతేకాకుండా, వీరు దక్షిణాసియా సమాజాల్లో సామాజిక స్థితి మరియు రాజకీయ అనుబంధాల ఆధారంగా విభజన సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు మేము పూర్తి వ్యతిరేకం." అంటూ యార్క్ సినిమాస్ సంచలన ప్రెస్ నోట్ విడుదల చేసింది.

యార్క్ సినిమాస్ చేసిన ఈ ఆరోపణలపై ప్రత్యంగిరా సినిమాస్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.