English | Telugu

ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ కలిసొచ్చిందా!  మూడు రోజుల కలెక్షన్స్ ఇవే  

ఈ నెల 12 న సెల్యులాయిడ్ పై ఒక కొత్త ప్రపంచం 'మిరాయ్'(Mirai)రూపంలో ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులని మెప్పిస్తూ, మూడు రోజులకి 81 .2 కోట్ల గ్రాస్ ని అందుకుంది. మేకర్స్ ఈ విషయాన్నీ అధికారంగా ప్రకటించారు. నిన్న జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ ప్రభావం కూడా 'మిరాయ్' కలెక్షన్ పై పడలేదంటే ఈ చిత్రం సాధించిన ఘన విజయాన్ని అర్ధం చేసుకోవచ్చు.

ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ థియేటర్స్ లో విడుదలైంది. తేజ సజ్జ(Teja Sajja)గత చిత్రం 'హనుమాన్'(Hanuman)హిందీలో భారీ కలెక్షన్స్ రాబట్టడంతో మిరాయ్ హిందీ వసూళ్ల పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం, మిరాయ్ తొలి రోజు 1.75 కోట్ల రూపాయలు వసులు చేసింది. తక్కువగానే కలెక్షన్స్ రావడంతో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అగ్ర దర్శకుడు 'కరణ్ జోహార్' మిరాయ్ ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ని రెండో రోజు నుంచే ప్రకటించాడు. దీంతో శనివారం 3.10 కోట్లు, ఆదివారం 3.81 కోట్లుతో టోటల్ గా మూడు రోజులకి 8.66 కోట్ల రూపాయల నెట్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.ఇలా ఆఫర్ ప్రకటించాక 'మిరాయ్' రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకోవడం గమనార్హం

శ్రీరాముడు ఆయుధమైన మిరాయ్ కి, సామ్రాట్ అశోకుడి శక్తులకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే పాయింట్ తో మిరాయ్ తెరకెక్కింది. దుష్టశక్తీ నుంచి దైవానుగ్రహంతో విశ్వాన్ని కాపాడే వేద అనే క్యారక్టర్ లో తేజ సజ్జ, దైవశక్తీ తో విశ్వాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనే 'మహావీర్ లామా' క్యారక్టర్ లలో మంచు మనోజ్(Manchu Manoj)పోటాపోటీగా నటించారు. శ్రీయ, రితికా నాయక్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వప్రసాద్(Tg Vishwaprasad)సుమారు 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)దర్శకుడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.