English | Telugu

తెలుగు సినీ పరిశ్రమ 'మేము సైతం' ప్రారంభ౦

'హుద్‌ హుద్‌' తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ చిత్రపరిశ్రమ `మేము సైతం' అంటూ చేపట్టిన బృహత్తర కార్యక్రమ౦ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన `మేము సైతం' గీతాన్ని గాయని, గాయకులూ ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, దర్శకరత్న దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు తదితర ప్రముఖలు హాజరయ్యారు. వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని మ్యుమంత్రి సహాయనిధికి అందించాలనే లక్ష్యంతో తెలుగు చలన చిత్రసీమ 12గంటల పాటు వివిధ కార్యక్రమాల ద్వార ఏకధాటిగా వినోదం పంచబోతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.