English | Telugu

నాకు ఒక చరిత్ర ఉంది.. కెరీర్ లోనే ఫస్ట్ టైం రికార్డు వ్యూస్ 

మాస్ మహారాజ 'రవితేజ'(Ravi Teja)అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara). యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా, ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ చేసిన చిత్రాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ అంతగా అలరించక పోవడంతో 'మాస్ జాతర'తో అయినా, తమ అభిమాన హీరో భారీ హిట్ ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. రవితేజ సరసన శ్రీలీల(Sreeleela)జత కడుతుండగా నూతన దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bogavarapu) తెరకెక్కించాడు.

రీసెంట్ గా మాస్ జాతర నుంచి టీజర్ రిలీజయ్యింది. నిమిషం ముపై సెకన్ల నిడివితో ఉన్న టీజర్ చూస్తుంటే మూవీలో రవితేజ ఎనర్జీ ఒక లెవల్లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ఒక క్యారక్టర్ రవితేజ గురించి చెప్తు 'తను చేసే ఫైర్ డిపార్ట్మెంట్ లో తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ లో వేలు పెడతాడని చెప్పించడం, శ్రీలీలతో రవితేజ చెప్పిన డైలాగులు చూస్తుంటే ప్రేక్షుకులకి ఈ సారి ఫుల్ మీల్స్ గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నాకంటూ ఒక చరిత్ర ఉందని రవితేజ చెప్పిన డైలాగ్ అభిమానులని విశేషంగా ఆకరిస్తుంది. ఫైట్స్ సరికొత్తగా డిజైన్ చేసారని అర్ధమవుతుండటంతో పాటు, విజువల్ గా ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా పనితనం మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది.

అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా మాస్ జాతర ని నిర్మించగా, రాజేంద్ర ప్రసాద్(Rajendraprasad)తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో((Beems sisirolio)సంగీత దర్శకత్వంలో ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి అద్భుతమైన స్పందన లభించింది. టీజర్ విడుదలైన నిమిషాల్లోనే రవితేజ గత చిత్రాల టీజర్స్ కంటే రికార్డు వ్యూస్ ని రాబడుతుంది.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.