English | Telugu

'మార్టిన్ లూథర్ కింగ్' ట్రైలర్.. సంపూ సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడు!

సంపూర్ణేష్ బాబు టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వి.కె. నరేష్, వెంకటేష్ మహా ముఖ్యపాత్రలు పోషించారు. 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం అక్టోబర్ 27న విడుదల కానుంది.

'మార్టిన్ లూథర్ కింగ్' ట్రైలర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. కనీసం తన పేరేంటో కూడా తెలియని చెప్పులు కుట్టే వ్యక్తిగా సంపూర్ణేష్ బాబు పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. అతనికి 'మార్టిన్ లూథర్ కింగ్' అనే పేరు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ప్రత్యర్థులు నరేష్, వెంకటేష్ మహా ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. గెలుపుకోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. అయితే గెలుపుని నిర్ణయించే ఒక్క ఓటు మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు)ది కావడంతో.. ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఓటు విలువని తెలియ జేస్తూనే వినోదభరితంగా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. "వాడుకోవడం చేతకానప్పుడు స్వతంత్రం ఉంటే ఎంత లేకపోతే ఎంత?" వంటి డైలాగ్ లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ట్రైలర్ లో సంగీతం, కెమెరా పనితనం కూడా ఆకట్టుకున్నాయి.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ముందస్తు ప్రీమియర్‌ షోలను ప్రదర్శించగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ట్రైలర్, ప్రీమియర్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ తో సంపూ అదిరిపోయే హిట్ కొట్టేలా ఉన్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.