English | Telugu

స్టైల్ మార్చిన మ‌ణిరత్నం... ఫోక‌స్ చేస్తున్నారా?

ప్ర‌ముఖ డైర‌క్ట‌ర్ మ‌ణిర‌త్నం స్టైల్ మార్చారా? మొన్న మొన్న‌టిదాకా సినిమా మీద మాత్రం ఫోక‌స్ చేసే ఆయ‌న‌, ఇప్పుడు ప‌బ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారా? ఆయ‌న వైఖ‌రి చూస్తుంటే, అది నిజ‌మేన‌నిపిస్తోంద‌ని అంటున్నారు క్రిటిక్స్. ఎప్పుడూ లేని విధంగా పొన్నియిన్ సెల్వ‌న్ 2 విష‌యంలో ఆయ‌న స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నార‌న్న‌ది అంద‌రూ గ‌మ‌నిస్తున్న విష‌యం. ఇప్ప‌టికే పొన్నియిన్ సెల్వ‌న్ 2కి సంబంధించి ప‌లు వీడియోలు రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా డ్ర‌స్సింగ్ అప్ ఆదిత్య క‌రికాల‌న్ అనే వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో విక్ర‌మ్ కేర‌క్ట‌ర్ ఆదిత్య క‌రికాళుడిగా మారిన విధానాన్ని పోట్రే చేశారు. భుజ‌కీర్తులు, క‌వ‌చ కుండ‌లాలు, మేక‌ప్ అంటూ ప్ర‌తి విష‌యాన్నీ క్షుణ్ణంగా ప‌రిచ‌యం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. పొన్నియిన్ సెల్వ‌న్ సినిమాలో విక్ర‌మ్‌కి ఏక ల‌ఖాని కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేశారు. విక్ర‌మ్ గైక్వాడ్ హెయిర్ అండ్ మేక‌ప్ చేశారు. కిష‌న్‌దాస్ అండ్ కో నుంచి జువెల‌రీ వ‌చ్చింది. ఈ వివ‌రాల‌న్నిటినీ వీడియోలో పొందుప‌రిచారు మేక‌ర్స్. లైకా ప్రొడ‌క్ష‌న్ తో క‌లిసి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు మ‌ణిర‌త్నం.

ఆదిత్య క‌రికాళుడిగా ఓ వైపు యుద్ధ‌వీరుడిగా ఉంటూనే, త‌న ప్రేయ‌సిని మ‌ర్చిపోలేక స‌త‌మ‌త‌మ‌య్యే వ్య‌క్తిగా న‌టించారు విక్ర‌మ్‌. ఆయ‌న సోద‌రిగా త్రిష‌, ప్రేయ‌సిగా ఐశ్వ‌ర్యారాయ్‌, సామంత రాజుగా, స్నేహితుడిగా కార్తి, సోద‌రుడిగా జ‌యం ర‌వి స్క్రీన్ మీద క‌నిపిస్తారు. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఆల్రెడీ విడుద‌లైన ఫ‌స్ట్ పార్టుకి 500 కోట్లకు పైగా వ‌సూళ్లొచ్చాయి. ఇప్పుడు సెకండ్ పార్టుని వెయ్యి కోట్ల మార్కుకు టార్గెట్ చేస్తున్నారు మేక‌ర్స్. ఈ సారి ఆస్కార్ రేసులో పొన్నియిన్ సెల్వ‌న్‌2 ని కూడా నిల‌పాల‌న్న‌ది మేక‌ర్స్ నిర్ణ‌యం. త్వ‌ర‌లోనే ఈ సినిమా ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని కూడా ఆదిత్య క‌రికాళుడి వీడియోలో మెన్ష‌న్ చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.