English | Telugu

హుద్ హుద్ వ‌ల్ల మంచే జ‌రిగిందంటున్న హీరో!

హుద్ హుద్ తుపానుతో ప‌చ్చ‌టి ఉత్తరాంధ్ర మొత్తం కొట్టుకెళ్లిపోతే.. ఆ తుపాను వ‌ల్ల మంచే జ‌రిగిందంటున్నాడు ఓ హీరో. అయ్యో.. అవేం మాట‌లు...?? అంటూ నివ్వెర పోకండి. ఈ హీరో అంటున్న మాట‌ల్లోనూ కాస్త లాజిక్ ఉంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రంటే... మంచు మ‌నోజ్‌. ఆయ‌న హుద్ హుద్ కోసం ఇలా ఎందుకు స్పందించాడంటే... ''సెల్‌పోన్ల వ‌ల్ల‌ ప్ర‌పంచం చిన్న‌దైపోయింది అంటున్నారు. కానీ మ‌నుషుల మ‌ధ్య దూరం పెరిగిపోతోంది. ప్ర‌తి ఒక్క‌రూ.. సెల్ చేతిలో ప‌ట్టుకొని త‌మ లోకంలో తాము మునిగిపోతున్నారు. ఆడ‌వాళ్లు.. ఇంట్లో టీవీల‌కు అతుక్కుపోతున్నారు. పెద్ద‌వాళ్లు కులం మ‌తం జాతి అంటూ కొట్టుకొంటున్నారు. ఇప్పుడేమైంది..?? హుద్ హుద్ ఎలాంటి బేధం లేకుండా అంద‌రికీ న‌ష్టం క‌లిగించి వెళ్లిపోయింది. హుద్ హుద్ వ‌ల్లే.. అంద‌రూ మ‌ళ్లీ ఏక‌మ‌వుతున్నాం. కుల మ‌తాలు ప‌ట్టించుకోకుండా ఒక‌రికి ఒక‌రు సాయం చేసుకొంటున్నాం. సెల్‌ఫోన్లు ప‌నిచేయ‌ని రోజుల్లో అంద‌రూ ప‌క్క ప‌క్క‌న కూర్చుని మాట్లాడుకోగ‌లుగుతున్నాం. జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇప్పుడు ఎలా బాగుప‌డ‌దాం అంటూ సానుకూల దృక్ప‌థంతో ఆలోచించ‌గ‌లుగుతున్నాం. హుద్ హుద్ వ‌ల్ల‌.. ఇన్ని మంచి ప‌నులు జ‌రిగాయి...'' అంటున్నాడు. మ‌నోజ్ మాటల్లోనూ నిజం ఉంద‌నిపిస్తోంది క‌దూ..!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.