English | Telugu

రూమర్ ని నిజం చేసిన నటుడు

మంచు లక్ష్మీ ప్రసన్న అంటే అందరికి తెలిసిందే. బ్రిటిష్ వాళ్ళు మన తెలుగును మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ ఈమె బాగా ఎక్కువగా మాట్లాడుతదని బయట ఒక టాక్ ఉంది. ఇదంతా కేవలం రూమర్స్ అని వదిలేద్దాం. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "సత్య-2". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే పలువురు సినీ ప్రముఖుల మధ్య జరిగింది.

అయితే ఈ ఆడియో వేడుకకు మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న ఇద్దరు కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అనుకోకుండా లక్ష్మీ టాక్ షో గురించి చెబుతూ..."మా అక్క ఎక్కువగా.... బాగా మాట్లాడను" అంటూ నాలుక కరుచుకుని.. వెంటనే అక్కడే లక్ష్మీకి సారీ చెప్పేసాడు. పైగా ఆ మాటలకూ కవరింగ్ చేస్తూ.."హేయ్ మా అక్క ఎక్కువగా మాట్లాడదయ్యా... బాగా క్యుట్ గా, చాలా బాగా మాట్లాడుతది" అంటూ కవరింగ్ చేసాడు. కానీ అక్కడున్నవారు మాత్రం నిజమే కదా అని నవ్వుకున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.