English | Telugu

'మళ్ళీ పెళ్లి' కాదిది.. పవిత్రమైన నరేష్ బయోపిక్!

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ పేర్లు కొంతకాలంగా తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. నరేష్, పవిత్ర పెళ్ళికి సిద్ధపడటం.. వారిపై నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి తీవ్ర విమర్శలు చేయడం వంటివి అప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈ గొడవల మధ్య 'మళ్ళీ పెళ్లి' అంటూ కొత్త సినిమాని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు నరేష్-పవిత్ర. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు.

'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తుంటే 'కథ కాదిది.. నరేష్, పవిత్రల బయోపిక్' అన్నట్టుగా ఉంది. నిజ జీవితంలో ఎలాగైతే నరేష్-పవిత్ర కలిసి ఉండటం, రమ్య రఘుపతి గొడవ చేయడం వంటివి జరిగాయో అలాంటి సన్నివేశాలే టీజర్ లో కనిపిస్తున్నాయి. రమ్య ప్రెస్ మీట్ లో తన భర్త మోసం చేశాడని, తనకి తన కొడుకు జీవితమే ముఖ్యమని చెప్పడం మొదలుకొని.. నరేష్-పవిత్ర హోటల్ లో ఉండగా పోలీసులను తీసుకొని రమ్య అక్కడికి వెళ్లడం, ఆమెని చూసి నరేష్ విజిల్ వేయడం వంటివన్నీ టీజర్ లో దర్శనమిచ్చాయి. మరి 'మళ్ళీ పెళ్లి' పేరుతో తమ జీవితంలో జరిగిన సంఘటనలనే సినిమాగా తీసుకొస్తున్న నరేష్, పవిత్ర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. ఈ చిత్రం మేలో విడుదల కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.