English | Telugu

వేసవిలో నరేష్, పవిత్ర 'మళ్ళీ పెళ్లి'

పెళ్లి వార్తలతో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ పేర్లు కొంతకాలంగా తెగ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు 'మళ్ళీ పెళ్లి' అంటూ కొత్త సినిమాని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ నిర్మిస్తుండటం విశేషం.

'మళ్ళీ పెళ్లి' మూవీ ఫస్ట్ లుక్ ని శుక్రవారం విడుదల చేశారు. పవిత్ర ముగ్గు వేస్తుండగా, చిరునవ్వు చిందిస్తూ నరేష్ తిలకిస్తున్న పోస్టర్ కలర్ ఫుల్ గా ఉంది. అలాగే పోస్టర్ లో ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. కాగా 50 ఏళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కలిసి 'మళ్ళీ పెళ్లి' అనే చిత్రంలో నటించగా.. ఇప్పుడదే టైటిల్ తో నరేష్ సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.