English | Telugu

స్టార్స్ కి చుక్కలు చూపిస్తున్న మహావతార్ నరసింహ!

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కూడా రెండు వారాలు ఆడటం గగనమైపోయింది. అలాంటిది ఓ యానిమేషన్ ఫిల్మ్ నాలుగో వారంలోనూ సంచలన వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అదే 'మహావతార్ నరసింహ'.

జూలై 24న 'హరి హర వీరమల్లు' విడుదల కాగా, ఆ మరుసటి రోజు జూలై 25న థియేటర్లలో అడుగుపెట్టింది మహావతార్ నరసింహ. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ మైథలాజికల్ యానిమేషన్ ఫిల్మ్.. కేవలం మౌత్ టాక్ తోనే రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ వచ్చింది. దీంతో 'హరి హర వీరమల్లు'తో పాటు జూలై 31న విడుదలైన 'కింగ్డమ్' కూడా మహావతార్ ముందు నిలబడలేకపోయాయి. 20 రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

అయితే ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' రూపంలో రెండు భారీ సినిమాలు రావడంతో.. ఇక 'మహావతార్ నరసింహ' కలెక్షన్ల జోరుకి బ్రేకులు పడతాయని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. 'వార్-2', 'కూలీ' సినిమాల హవాలోనూ.. మహావతార్ తన జోరు చూపిస్తోంది. ఇప్పటికీ బుక్ మై షోలో గంటకు వేలల్లో టికెట్లు బుక్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్య కాలంలో ఇంతటి రన్ ఉన్న సినిమా లేదని చెప్పాలి. ఇప్పటికే రూ.250 కోట్లు రాబట్టిన మహావతార్.. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.