English | Telugu

లోకేష్ టార్గెట్ వెయ్యి కోట్లు!

తెలుగు, హిందీ, కన్నడ సినీ పరిశ్రమలకు రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. కానీ తమిళ పరిశ్రమ ఇంతవరకు ఆ ఫీట్ సాధించలేదు. కోలీవుడ్ కి చెందిన అట్లీ డైరెక్ట్ చేసిన 'జవాన్' రూ.1000 కోట్ల క్లబ్ లో చేరినప్పటికీ అది హిందీ సినిమా. దీంతో కోలీవుడ్ కి మొదటి వెయ్యి కోట్ల సినిమాని అందించే దర్శకుడు లోకేష్ కనగరాజ్ అవతాడనే చర్చ నడుస్తోంది.

కేవలం ఐదు సినిమాలతోనే తమిళ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు లోకేష్. 2017 వేసవిలో విడుదలైన 'మానగరం'తో లోకేష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కార్తీ హీరోగా 'ఖైదీ' అనే యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించి ఘన విజయం సాధించాడు. లోకేష్ మొదటి చిత్రం రూ.10 కోట్లకు పైగా వసూలు చేయగా, 'ఖైదీ' ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత లోకేష్ సినిమా సినిమాకి వసూళ్లు పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. విజయ్ తో చేసిన 'మాస్టర్' రూ.250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ప్రకటించి 'ఖైదీ'ని లింక్ చేస్తూ చేసిన 'విక్రమ్' ఏకంగా రూ.450 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఆ యూనివర్స్ లో భాగంగానే రూపొందిన 'లియో' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రూ.500 కోట్లకు పైగా రాబట్టి రూ.600 కోట్ల దిశగా దూసుకుపోతోంది. దీంతో తదుపరి సినిమాతో లోకేష్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడనే ఆసక్తి నెలకొంది.

లోకేష్ తన తదుపరి సినిమాని రజినీకాంత్ తో చేయనున్నాడు. అత్యధిక వసూళ్ళు రాబట్టిన తమిళ చిత్రాల లిస్టులో టాప్-2 లో రజినీకాంత్ సినిమాలే ఉండటం విశేషం. '2.0', 'జైలర్' సినిమాలతో రెండు సార్లు రూ.600 కోట్ల ఫీట్ సాధించాడు రజినీ. ఇప్పుడు రజినీకి లోకేష్ తోడైతే వెయ్యి కోట్లు రాబట్టడం పెద్ద విషయేమీ కాదు. మరి వీరి కాంబినేషన్ కోలీవుడ్ కి మొదటి వెయ్యి కోట్ల సినిమాని అందిస్తుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.