English | Telugu

హన్సికకు దెయ్యం పట్టిందా?

గతంతో పోలిస్తే హారర్‌ సినిమాలకు ఆదరణ ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. ప్రేక్షకులు భయపడుతూ ఎంజాయ్‌ చెయ్యడానికి బాగా ఇష్టపడుతున్నారు. అందుకే హారర్‌ బేస్డ్‌ మూవీస్‌ ఘనవిజయం సాధిస్తున్నాయి. కొంతమంది ప్రముఖహీరోయిన్లు కూడా ఈ తరహా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేశముదురు’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన హన్సిక ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలో తన అందచందాలతో అలరించింది. ఇప్పుడు తమిళ్‌ సినిమాలు ఎక్కువగా చేస్తూ కోలీవుడ్‌లో బాగా బిజీ అయిపోయింది. కమర్షియల్‌ సినిమాలతోపాటు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ కూడా చేస్తోంది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గార్డియన్‌’ చిత్రం హాట్‌ టాపిక్‌గా మారింది. శబరి, గురు శరవణన్‌ దర్శకత్వంలో పూర్తి హారర్‌ మూవీగా ‘గార్డియన్‌’ రూపొందుతోంది. రెగ్యులర్‌ సినిమాల్లోలా కాకుండా ఈ సినిమాలో హన్సికను డిఫరెంట్‌గా చూపించబోతున్నామని దర్శకులు తెలిపారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. టీజర్‌ రిలీజ్‌ తర్వాత సినిమా అంచనాలు బాగా పెరిగాయి. హారర్‌ సినిమాలు ఏ భాషలో తీసినా ఆకట్టుకుంటాయని గతంలో చాలా సినిమాలు ప్రూవ్‌ చేశాయి. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్‌ ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి విడుదల చేశారు. ఈ సినిమాలో హన్సిక ఒక సాధారణ అమ్మాయిగా నటించింది. ఎవరూ ఊహించని విధంగా ఆమెను ఒక ఆత్మ పీడిస్తూ ఉంటుంది. దాంతో దెయ్యంగా మారిన హన్సిక ఏం చేసింది అనేది చిత్ర కథాంశం. ప్రముఖ దర్శకుడు విజయ్‌ చందర్‌ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. సామ్‌ సిఎస్‌ సంగీతాన్ని అందించాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.