English | Telugu

ఫ్రస్ట్రేషన్ లో విజయ్ దేవరకొండ.. చూస్తుండిపోయిన సమంత.. !

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'ఖుషి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. 'నిన్ను కోరి', 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల కాగా.. అన్ని కూడా సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో.. శనివారం (ఆగస్టు 26) ఐదో పాటని రిలీజ్ చేసింది యూనిట్. "ఓసి పెళ్ళామా" అంటూ మొదలయ్యే ఈ పాటలో ఫ్రస్ట్రేటేడ్ హజ్బెండ్గా విజయ్ దేవరకొండ కనిపించారు. పార్టీ నేపథ్యంలో సాగే ఈ సాంగ్ లో విజయ్ తన బాధను వ్యక్తం చేస్తుంటే.. సామ్ మాత్రం సీరియస్ గా చూస్తూ కనిపించింది. ఈ పాటకి శివ నిర్వాణ సాహిత్యమందించగా.. రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ గాత్రమందించారు. మొత్తమ్మీద.. "ఓసి పెళ్ళామా" గీతం'ఖుషి' నుంచి వచ్చినమరో చార్ట్ బస్టర్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 1న 'ఖుషి' జనం ముందుకు రానుంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.