English | Telugu

ద‌స‌రా బ‌రిలో అక్కాచెల్లెల ఫైట్‌!

ద‌స‌రా సీజ‌న్ కోసం ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్. కార‌ణ‌మేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పండుగ సీజ‌న్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సినిమాలే అందుకు కార‌ణం. తెలుగులో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న భ‌గ‌వంత్ కేస‌రితో పాటు మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన లియో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తుది ద‌శ‌కు చేరుకుంది. వీటి మ‌ధ్య‌నే పోటీ రంజుగా ఉంటే క‌న్న‌డ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఘోస్ట్ సినిమా కూడా లైన్‌లోకి వ‌చ్చింది. వీటి మ‌ధ్యనే పోటీ ఉంటే తాజాగా బాలీవుడ్ సినిమా గ‌ణ్‌ప‌థ్ కూడా ర‌య్ మంటూ రేసులోకి వ‌చ్చింది. బాలీవుడ్ యంగ్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్‌.. బ్యూటీ డాల్ కృతి స‌న‌న్ జంట‌గా న‌టిస్తున్నారు.

టైగ‌ర్ ష్రాఫ్‌తో క‌లిసి కృతి స‌న‌న్ యాక్ష‌న్ సీన్స్‌లో అద‌ర‌గొట్ట‌బోతుంద‌ని రీసెంట్‌గా రిలీజైన పోస్ట‌ర్స్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. అంద‌రూ హీరోల మ‌ధ్య‌నే పోరుని ఆస‌క్తిక‌రంగా గ‌మ‌నిస్తున్నారు కానీ.. ఇద్ద‌రు హీరోయిన్స్ మ‌ధ్య కూడా క్లాష్ ఏర్ప‌డింది. అది కూడా వాళ్లు అక్కాచెల్లెలు కావ‌టం. వారెవ‌రో కాదు.. కృతిస‌న‌న్‌, నుపూర్ స‌న‌న్‌. అది కూడా వీళ్లు పాన్ ఇండియా మూవీస్‌తోనే సై అంటే సై అంటున్నారు. గ‌ణ్‌పథ్ సినిమాలో కృతి స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు మూవీలో నుపూర్ స‌న‌న్ క‌థానాయిక‌. నుపూర్ ఇది తొలి మూవీ కావ‌టం విశేషం.మ‌రి ఈ ఆస‌క్తిక‌ర‌మైన బాక్సాఫీస్ వార్‌లో గెలిచేదెవ‌రో తెలుసుకోవాలంటే ద‌స‌రా వ‌ర‌కు ఆగాల్సిందే. ఒక‌వేళ నుపూర్ స‌న‌న్ హిట్ కొడితే మాత్రం క‌చ్చితంగా ఆమె కెరీర్‌లో అదొక మెమ‌ర‌బుల్ మూవీగా నిలిచిపోతుంద‌న‌టంలో సందేహం లేదు. గ‌ణ్‌ప‌థ్ చిత్రాన్ని వికాస్ బ‌ల్ డైరెక్ట్ చేస్తుంటే.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుని వంశీ తెర‌కెక్కిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.