English | Telugu

విజయ్ పూర్తిగా పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు ఆ డైరెక్టర్ తోనేనా సినిమా  

ఇళయ దళపతి విజయ్ కి తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలుసు. లేటెస్టుగా విజయ్ నుండి వచ్చిన లియో మూవీ టాక్ తో సంబంధం లేకుండా తమిళనాడు లో రికార్డు స్థాయి కల్లెక్షన్లని సృష్టించింది. ఆ సందర్భంగా చిత్ర బృందం లియో సక్సెస్ మీట్ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించింది. ఆ ఫంక్షన్ లో విజయ్ ఇన్ డైరెక్టుగా త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొనబోతున్నాననే హింట్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు విజయ్ వరుసగా చెయ్యబోయే సినిమాల గురించి తమిళనాడులో చర్చ నడుస్తుంది.

తమినాడు చిత్ర పరిశ్రమలో కార్తీక్ సుబ్బరాజ్ కి మంచి క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు ఉంది. పిజ్జా , జిగర్తాండ మూవీలే అందుకు ఉదాహరణ. సుబ్బరాజ్ తాజాగా లారెన్స్, ఎస్ జె సూర్య లతో జిగర్తాండ మూవీ కి సీక్వెల్ గా జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీని తెరకెక్కించి మంచి హిట్ ని కూడా అందుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ నా దగ్గర విజయ్ సార్ ఇమేజ్ కి సరిపడే మంచి కథ ఉందని పూర్తి స్థాయి స్రిప్ట్ తో ఆ కథ సిద్ధంగా ఉందని చెప్పాడు. కార్తీక్ సుబ్బరాజ్ ఇలా ప్రకటించాడో లేదో అప్పుడే తమిళ నాట ఆ సినిమా గురించి చర్చ మొదలయ్యింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి పూర్తి సమయం కేటాయించే ముందు కార్తీక్ సుబ్బరాజ్ అండ్ విజయ్ ల సినిమా ఉండవచ్చని తమిళనాడు లో మాట్లాడుకుంటున్నారు.

మొన్న వచ్చిన లియో విజయ్ కి 67 వ సినిమా. ఇప్పడు తన 68 వ సినిమాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ సినిమా చెయ్యబోతున్నాడు.ఈ మేరకు అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది. మరి కార్తీక్ సుబ్బరాజ్ విజయ్ కి తన దగ్గర ఉన్న కథ చెప్పి విజయ్ తదుపరి చిత్రానికి తనే దర్శకుడు అవుతాడేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.