English | Telugu

దిల్ రాజు ఆశలన్నీ 'కేరింత' పైనే..!

చిన్న సినిమాలతో వరుస హిట్లు కొట్టి మంచి నిర్మాతగా పేరుపొందిన దిల్ రాజు గత కొంతకాలంగా భారీ సినిమాలు తీసి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. మళ్ళీ సక్సెస్ బాట పట్టడానికి తన పాత దారిలోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం డైరెక్టర్ గా రెండు వరుస విజయాలు సాధించిన వినాయకుడు ఫేం సాయికిరణ్ అడివితో 'కేరింత' అనే ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. అంతా కొత్త వాళ్లతో నిర్మించబోతున్న ఈ చిత్రానికి ముందుగానే స్టార్ హంట్ చేసి నటీ నటులను ఎంపిక చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ నెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ౦కానున్న ఈ సినిమాపై దిల్ రాజు చాలా ధీమాగా వున్నాడట. దర్శకుడు సాయి కిరణ్ అడివి,అతని టీమ్ రెండేళ్లు కష్టపడి స్క్ర్రిప్ట్‌పై వర్క్ చేయడంతో బాగా వచ్చిందని అంటున్నారు. దిల్ రాజు గత చిత్రాల మాదిరిగానే ఈ మూవీలో కూడా ఫ్రెష్ ఫీల్ వుంటుందట. ఈ సినిమాతో తాను మళ్ళీ పాత ట్రాక్ లోకి వస్తానని రాజుగారు ధీమాగా వున్నారట. సెప్టెంబర్‌ లో సినిమాను కంప్లీట్‌ చేసి దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.