English | Telugu

సినీగీత రచయిత కలువకృష్ణ సాయి దుర్మరణం

సినీగీత రచయిత కలువకృష్ణ సాయి దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే వర్థమాన సినీ గీత రచయిత కలువకృష్ణ సాయి నిన్నరాత్రి గుండెపోటుతో అకాలమరణం పాలయ్యారు. చనిపోయే నాటికి ఆయన వయసు ముప్పై సంవత్సరాలు మాత్రమే. కలువ కృష్ణ సాయి "కబడ్డీ కబడ్డీ, సామాన్యుడు, బహుమతి, విక్టరీ, రంగ ది దొంగ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు, గాయం-2, రక్తచరిత్ర" వంటి సినిమాలకు పాటలనందించారు.

ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మించిన "రక్తచరిత్ర"లో రాసిన పాటకు కలువకృష్ణ సాయికి పాటల రచయితగా మంచి పేరు గుర్తింపు లభించాయి. ఆ తర్వాత "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" పాటలకు కూడా కలువ కృష్ణ సాయికి మంచి పేరు లభించింది. ఇప్పుడిప్పుడే పాటల రచయితగా పేరు సంపాదించుకుంటున్న కలువకృష్ణ సాయి చిన్న వయసులోనే చనిపోవటం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగువన్ ఆ భగవంతుని కోరుతోంది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.