English | Telugu

హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రభాస్ తర్వాత ఒకే ఒక్కడు..!

'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఎన్టీఆర్ కెరీర్ లో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమా 'వార్-2' కావడం విశేషం.

'ఆర్ఆర్ఆర్'తో మొదటిసారి ఈ ఫీట్ సాధించాడు ఎన్టీఆర్. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' కూడా దాదాపు రూ.500 కోట్లు సాధించింది. ఇక ఇప్పుడు 'వార్-2' ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి.. 400 కోట్ల దిశగా పయనిస్తోంది.

ఇప్పటిదాకా హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ కలిగి ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ఏకంగా రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. మొదటిసారి 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'సాహో' సినిమాలతో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' చిత్రాలతో మరోసారి హ్యాట్రిక్ 300 కోట్లు సాధించాడు. ప్రభాస్ తర్వాత హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ ఉన్న టాలీవుడ్ హీరోగా ఇప్పుడు ఎన్టీఆర్ నిలిచాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.