English | Telugu

ఓటీటీలో 'హరి హర వీరమల్లు' కొత్త వెర్షన్.. ఇది ముందే చేయొచ్చు కదా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ 'హరి హర వీరమల్లు'. జులై 24న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సెకండాఫ్.. అందునా వీఎఫ్ఎక్స్ సీన్స్ పై నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో థియేటర్లలో ప్రదర్శితమవుతుండగానే కొన్ని సీన్లను ట్రిమ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఓటీటీలో మరో కొత్త వెర్షన్ దర్శనమిచ్చింది. (Hari Hara Veera Mallu)

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు(ఆగస్టు 20) నుంచి 'హరి హర వీరమల్లు' స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ వెర్షన్ తో పోలిస్తే ఓటీటీ వెర్షన్ లో పది నిమిషాలకు పైగా ట్రిమ్ చేశారు. ఇప్పటికే గుర్రపు స్వారీ సన్నివేశాలను ట్రిమ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు క్లైమాక్స్ లోనూ మార్పులు చేశారు.

థియేటర్లలో విడుదలైన సమయంలో 'హరి హర వీరమల్లు' క్లైమాక్స్ మెప్పించలేకపోయిందనే కామెంట్స్ వచ్చాయి. దానిని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్.. క్లైమాక్ సీన్స్ లో మార్పులు చేశారు. ప్రీ క్లైమాక్స్ ఫైట్ తర్వాత తుఫాన్ ఎపిసోడ్ ని తొలగించి.. డైరెక్ట్ గా పార్ట్-2 కి లీడ్ ఇచ్చారు. మరికొన్ని సీన్స్ ని కూడా ట్రిమ్ చేశారు.

ఓటీటీలో 'హరి హర వీరమల్లు' కొత్త వెర్షన్ చూసిన తర్వాత మెజారిటీ అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇదేదో ముందే చేసుంటే.. థియేటర్లలో సినిమా కాస్త బెటర్ గా పర్ఫామ్ చేసేదని అభిప్రాయపడుతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.