English | Telugu

జానీ మాస్టర్‌ విషయంలో రామ్‌చరణ్‌ అలా చేయడానికి రీజన్‌ ఏమిటంటే..?

- చరణ్‌తో జానీ మాస్టర్ ఫస్ట్ మూవీ రచ్చ

- నాలుగు భాషల్లో స్టార్ కొరియోగ్రాఫర్

- పెద్దిలో చికిరి చికిరి సాంగ్

తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలకు నృత్యరీతులు సమకూర్చి కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్‌ గురించి అందరికీ తెలిసిందే. 2009లో తన కెరీర్‌ను ప్రారంభించిన జానీ.. అందరు స్టార్‌ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. అయితే టాలీవుడ్‌లో జానీ మాస్టర్‌ని ఎక్కువ ఎంకరేజ్‌ చేసిన హీరో రామ్‌చరణ్‌.

జానీ మాస్టర్‌ మొదట వర్క్‌ చేసిన స్టార్‌ హీరో చరణ్‌. అంతకుముందు కొన్ని సినిమాలకు పని చేసినా రచ్చ సినిమా కోసం జానీని పిలిపించి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా తను చేసిన చాలా సినిమాలకు జానీ మాస్టర్‌ను కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నారు చరణ్‌. ఆ క్రమంలోనే స్టార్‌ హీరోలంతా జానీతో కొరియోగ్రఫీ చేయించుకున్నారు. అలా ఇండియాలో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ కొరియోగ్రాఫర్స్‌గా పేరు తెచ్చుకున్నారు జానీ.

ఇదిలా ఉంటే.. 2024లో జానీపై లైంగిక ఆరోపణలు రావడంతో నెలరోజులపాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత అందరూ తనని నేరస్తుడిగా చూస్తుండడం, వచ్చిన నేషనల్‌ అవార్డు చేజారిపోవడం వంటి కారణాల వల్ల జానీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అయితే వెంటనే తనని తాను తెలుసుకొని ఎప్పటిలాగే డాన్స్‌ ప్రాక్టీస్‌ చేసుకుంటూ సినిమా అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నాడు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తను హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం కోసం జానీని పిలిపించి ఒక పాట చేసే అవకాశం ఇచ్చారు రామ్‌చరణ్‌. ‘చికిరి చికిరి..’ అంటూ సాగే ఈ పాట ఇటీవల విడుదలైంది. ఈ పాటలో జానీ కంపోజ్‌ చేసిన స్టెప్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మెగా అభిమానులు ఈ పాటను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

జానీ మాస్టర్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిలిచి మరీ అవకాశం ఇచ్చిన చరణ్‌ని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న జానీకి అండగా నిలిచినందుకు చరణ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తన కెరీర్‌ ఆరంభం నుంచి టాలెంట్‌ ఉన్న టెక్నీషియన్స్‌ని చరణ్‌ ఎంకరేజ్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా చికిరి చికిరి సాంగ్‌ను జానీ మాస్టర్‌తో చేయించడం గురించి నెటిజన్లు స్పందిస్తూ.. కష్టాల్లో ఉన్నవారి వెన్నంటి నిలబడి ప్రోత్సహించడం నిజంగా అభినందించాల్సిన విషయం అంటూ చరణ్‌ను అభినందిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.