English | Telugu

35 దేశాల్లో 'జైలర్' ట్రెండింగ్.. తలైవా ఎక్కడైనా తగ్గేదేలే

'రోబో' తరువాత సరైన విజయం లేని సూపర్ స్టార్ రజినీకాంత్.. రీసెంట్ మూవీ 'జైలర్'తో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆగస్టు 10న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా.. అద్భుత విజయం సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ మూవీ.. రూ. 600 కోట్లకి పైగా గ్రాస్ ఆర్జించి సంచలనం సృష్టించింది. అంతేకాదు.. తమిళనాట ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కూడా.

ఇదిలా ఉంటే, గత గురువారం (సెప్టెంబర్ 7) నుంచి ఓటీటీలోనూ 'జైలర్' స్ట్రీమ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. థియేటర్స్ లో ఎలాగైతే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఓటీటీలోనూ అదే బాటలో పయనిస్తోంది. 2023 వీక్ 37లో అమెజాన్ ప్రైమ్ నుంచి వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతున్న సినిమాల్లో జైలర్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే, 37 దేశాల్లో ఈ సెన్సేషనల్ మూవీ ట్రెండింగ్ లో ఉందని సమాచారం. దీంతో.. "తలైవా ఎక్కడైనా తగ్గేదేలే" అంటూ రజినీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా, 'జైలర్'కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.