English | Telugu

నిజ జీవితంలో హీరో అయిన విలన్‌ కుమారుడికి షమీ క్రికెట్‌ కోచింగ్‌!

భారత జట్టులో సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న షమీ ఓ నటుడి కుమారుడికి క్రికెట్‌ కోచింగ్‌ ఇస్తున్నాడు.ప్రముఖ నటుడు సోనూసూద్‌ కుమారుడు అయాన్‌కు షమీ క్రికెట్‌ పాఠాలు చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోనూసూద్‌ షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. తన చిన్న కుమారుడు అయాన్‌కు షమీ బ్యాటింగ్‌ మెళకువలు నేర్పుతున్నట్లు వీడియోలో తెలియజేశాడు సోనూ సూద్‌. అయాన్‌కు క్రికెట్‌లో కోచింగ్‌ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సోను షేర్‌ చేసిన వీడియో పాతది. మూడేళ్ళ క్రితం అయాన్‌కు షమీ ట్రైనింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచకప్‌లో షమీ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్‌తో నా కుమారుడు అయాన్‌కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్‌ను ట్యాగ్‌ చేశాడు.

విలన్‌గా ఎన్నో సినిమాల్లో రాణించిన సోనూ సూద్‌ నిజ జీవితంలో మాత్రం హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కరోనా సమయంలో సోను చేసిన సేవా కార్యక్రమాలు ఎవ్వరూ మర్చిపోలేనివి. ఇప్పటికీ ఎవరైనా సాయం కోరి వస్తే కాదనకుండా తన చేతనైనంత సహాయం అందిస్తున్న సోనుకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. సోను చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే.. బాలీవుడ్‌లో ‘ఫతే’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్‌తో కలిసి రూపొందించిన ‘ఫతే’ మూవీ 2024లో విడుదల కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.