English | Telugu

అప్పులు తీర్చాల‌ని ఫిక్స్ అయిన విశాల్‌

గ‌త కొన్నాళ్లుగా వ‌రుస‌గా యాక్సిడెంట్లు, అప్పుల వార్త‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు విశాల్‌. వాట‌న్నిటి గురించి బాగా ఆలోచించి ఇప్పుడు ఓ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌న్నిహితుల‌తో అంటున్నారట‌.
లైకాతో త‌న‌కున్న ఇబ్బందుల‌కు కూడా ఫుల్ స్టాప్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందులో భాగంగానే ఓన్ బ్యాన‌ర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ లో కొన్నాళ్ల పాటు సినిమాల‌ను నిర్ణ‌యించ‌కూడ‌ద‌ని అనుకుంటున్నార‌ట‌. త‌న‌తో సినిమాలు తీయాల‌నుకునే నిర్మాత‌లు క‌థ‌ల‌తో వ‌స్తే, న‌చ్చితే ఓకే చేస్తాన‌ని అంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం హ‌రి సినిమాలో న‌టిస్తున్నారు విశాల్‌. ఇటీవ‌ల ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. సూర్య హీరోగా హ‌రి ఓ సినిమా చేయాల్సింది. అయితే హ‌రి చెప్పిన పాయింట్‌లో సూర్య కొన్ని మార్పులు చేర్పులు సూచించార‌ట‌. హ‌రి అందుకు ఒప్పుకోలేదు. గ‌తంలో త‌న‌ను న‌మ్మి చేసిన‌ట్టే,ఈ స‌బ్జెక్టును కూడా చేయ‌మ‌ని అన్నార‌ట‌. కానీ సూర్య అప్ప‌టికే నెక్స్ట్ స్టెప్ వేసేశారు. అందువ‌ల్ల సూర్య ఇచ్చిన కోటి రూపాయ‌ల అడ్వాన్సును హ‌రి తిరిగి ఇచ్చేయ‌డానికి వెళ్లార‌ట‌.

అయితే దాన్ని తీసుకోవ‌డానికి సూర్య సుముఖంగా లేరు. పైగా ఇటీవ‌ల హ‌రి స్టార్ట్ చేసిన స్టూడియో స్వ‌యంగా వ‌చ్చి ఓపెన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లారు. అలా సూర్య వ‌ద్ద‌న్న స‌బ్జెక్టుతోనే ఇప్పుడు విశాల్ సినిమా తెర‌కెక్కుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పూర్తి మాస్ మసాలా యాక్ష‌న్ సినిమాగా తెర‌కెక్కిస్తున్నార‌ట‌. హ‌రి సినిమా మాత్ర‌మే కాదు, నెక్స్ట్ కూడా వ‌రుస‌గా బ‌య‌టి బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నారు విశాల్‌. న‌డిగ‌ర్ సంగం ప‌నుల‌ను కూడా నాజ‌ర్‌, కార్తికే ఎక్కువ‌గా అప్ప‌గించేస్తున్నార‌ట విశాల్‌. మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు కూడా ఓకే చెప్పాల‌న్న‌ది ఆయ‌న లేటెస్ట్ నిర్ణ‌యం. ఇంత‌కు పూర్వం షూటింగుల‌కు అటూ ఇటూగా వ‌చ్చే విశాల్‌, ఇప్పుడు టైమ్ అంటే టైమ్‌కి ఉంటున్నార‌నే మాట కూడా వినిపిస్తోంది. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవ‌డం వ‌ల్లే విశాల్‌లో ఇంత మార్పు చూడ‌గ‌లుగుతున్నామ‌ని అంటున్నాయి కోడంబాక్కం వ‌ర్గాలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.