English | Telugu

మాదాపూర్ డ్ర‌గ్స్... హైదరాబాద్‌లో హీరో నవదీప్

మాదాపూర్ డ్ర‌గ్స్ కేసులో హీరో న‌వ‌దీప్ పేరు ప్ర‌ముఖంగా చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అందులో ముగ్గురు నైజీరియ‌న్స్ కూడా ఉన్నారు. అంతే కాకుండా ఈ వ్య‌వ‌హారంపై న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న చెప్పిన దాని ప్ర‌కారం టాలీవుడ్ న‌టుడు న‌వ‌దీప్‌కు ఈ కేసుతో సంబంధం ఉంద‌ని, అయితే త‌ను ప‌రారీలో ఉన్నార‌ని అన్నారు. అయితే సోష‌ల్ మీడియా వేదిక‌గా న‌టుడు న‌వ‌దీప్ ఖండించారు. త‌న‌కు పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన డ్ర‌గ్ కేసుకి సంబంధం లేద‌ని ఆయ‌న అన్నారు. తాను ఎక్క‌డికీ పారిపోలేద‌ని, హైద‌రాబాద్‌లోనే ఉన్నానని నవ‌దీప్ అన్నారు.

త‌న కొత్త సినిమాకు సంబంధించిన సాంగ్ లాంచ్ ప‌నుల్లో బిజీగా ఉన్న‌ట్లు న‌వ‌దీప్ తెలిపారు. పోలీసుల పేర్కొన్న న‌వ‌దీప్ తాను కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే ఈ కేసులో న‌వ‌దీప్ ఫ్రెండ్ రామ్ చంద‌ర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. త‌ను ఇచ్చిన వివరాల మేర‌కు న‌వ‌దీప్‌కు ఈ కేసుకి సంబంధం ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. గ‌తంలోనూ టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో న‌వ‌దీప్ పేరు చ‌క్క‌ర్లు కొట్టింది. ఆ స‌మ‌యంలో ఈడీ, నార్కోటిక్ విచార‌ణ‌కు కూడా ఆయ‌న హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

బేబి సినిమాలో యువ‌త డ్ర‌గ్స్ తీసుకునే స‌న్నివేశాలు ఉండ‌టం వ‌ల్ల తాము స‌ద‌రు సినిమా నిర్మాత‌ల‌కు నోటీసులు ఇవ్వ‌నున్నామ‌ని క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ పేర్కొన‌టం కూడా పెద్ద టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్త‌ల‌పై బేబి ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ ప్ర‌త్యేకంగా స్పందించారు. బేబి సినిమాలో కథ ప్ర‌కార‌మే రెండు పాత్రల మధ్య డ్రగ్ తీసుకున్న సన్నివేశాలు ఉన్నాయని, అయితే వాటిని థియేటర్ , ఓటీటీలో ప్రదర్శించినప్పుడు చట్టబద్ధమైన హెచ్చరిక ఇచ్చామని ఆయన ఈ సంద‌ర్బంగా తెలిపారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.