English | Telugu

ఆది..నీ కామెడీ షోస్ చూసి నెక్స్ట్ టైం నేను కూడా విజిల్స్, క్లాప్స్ కొడతానన్న ధనుష్

ధనుష్, సంయుక్త మీనన్ కలిసి నటించిన "సర్" మూవీ 17 న రిలీజ్ అవుతున్న సందర్భంగా దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ వేణు అట్లూరి. ఈ ఈవెంట్ లో మూవీ టీమ్ అంతా పార్టిసిపేట్ చేశారు. ఇక మూవీలో హీరో ధనుష్ కి క్లోజ్ ఫ్రెండ్ పాత్రలో హైపర్ ఆది నటించాడు. ఈవెంట్ లో ధనుష్ మాట్లాడుతూ "హైపర్ ఆది నాకు తెలీదు...గతంలో ఒక ఫంక్షన్ లో హైపర్ ఆదిని చూసాను.

ఆయన మాట్లాడాక ఫుల్ విజిల్స్, క్లాప్స్ ఆడియన్స్ నుంచి. వెరీ బిగ్ మాన్. నిజంగా నాకు తెలీదు.. నువ్వు ఇక్కడ ఎందుకు ఫేమస్ అనే విషయం. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది." అని ధనుష్ అనేసరికి త్రివిక్రమ్ ఆది గురించి వివరించారు.. "ఆది ఇక్కడ కామెడీ షో జబర్దస్త్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసాడు. తర్వాత రైటర్ గా యాక్టర్ గా సక్సెస్ సాధించాడు. ఇలా ఒక ఆరేడేళ్లు చేసి ఆ తర్వాత మూవీస్ వైపుకు వచ్చాడు" అని చెప్పేసరికి ధనుష్ వెంటనే "నేను యూట్యూబ్ లో నీ జబర్దస్త్ కామెడీ షోస్ చూస్తాను.

నెక్స్ట్ టైం నేను కలిసినప్పుడు నీకోసం నేను కూడా క్లాప్స్ కొడతాను, విజిల్స్ వేస్తాను." అనేసరికి హైపర్ ఆది ధనుష్ కాళ్ళకు దణ్ణం పెట్టుకుని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ అందుకుంటే మాత్రం హైపర్ ఆది రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడిప్పుడే మూవీస్ లో రోల్స్, రైటర్ గా సక్సెస్ అవుతున్నాడు. ఫైనల్ గ ధనుష్ లాంటి టాప్ స్టార్ పక్కన అవకాశం రావడమే చాలా కష్టం. అలాంటిది ఆదికి అవకాశం వచ్చింది. ఇక మీదట కూడా ఇలాంటి ఎన్నో ఛాన్సెస్ ఆది ముందు క్యూ కడతాయని అంటున్నారు ఆయన ఫాన్స్.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.