English | Telugu

హనీమూన్ టైంలో గొడవయ్యింది...షోలో చెప్పిన ఆది..!


"అలా మొదలయ్యింది" షో ప్రతీ వారం నవ్వులతో సాగిపోతోంది. హోస్ట్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు కదా. ఇక ఈ షోకి వచ్చే సెలబ్రిటీస్ ని కూడా అలాగే నవ్విస్తూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాడు. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆది సాయికుమార్ తన వైఫ్ అరుణతో కలిసి వచ్చాడు. వీళ్ళను కిషోర్ తెగ నవ్వించాడు. రావడంతోనే "మాది అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు" అని క్లారిటీ ఇచ్చేసాడు ఆది. మీరు మీ ఆయన్న పేరుతో పిలుస్తారా లేదా ఏవండీ అని అలా పిలుస్తారా అని కిషోర్ అడిగేసరికి అరుణ నవ్వేసింది. సినిమా వాళ్ళు అంటే ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా "నేను కూడా ఆ విషయం గురించే మా అమ్మా వాళ్ళను అడిగాను...ఎలాగమ్మా మీరు ఈ సంబంధాన్ని ఓకే చేసి పెళ్లి చూపుల వరకు తీసుకొచ్చారు" అని అంది అరుణ.

"అంతా ఒకే అనుకున్నాక..నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే అరుణ నంబర్ తీసుకున్నాను..తర్వాత మూడునాలుగు గంటలు మాట్లాడుకున్నాం" అని చెప్పాడు ఆది. "నేను మాత్రం మా నాన్నను అడిగి నా ఫోన్ నెంబర్ ని తనకు ఇచ్చాను" అని చెప్పింది అరుణ. "మీ ఇద్దరి మధ్య ఫస్ట్ గొడవ పెళ్లయ్యాక ఎప్పుడు జరిగింది" అని కిషోర్ అడిగేసరికి "హనీమూన్ లో అనుకుంటా గొడవ జరిగింది" అని ఆది చెప్పాడు. అదేంటి "పడవ గురించి చెప్తారనుకుంటే గొడవ గురించి చెప్తున్నారు" అని ఫన్నీ కౌంటర్ వేసాడు కిషోర్. తర్వాత అన్ని రకాల ఎమోషన్స్ తో "ఐ లవ్ మై వైఫ్" అని చెప్పాడు ఆది దాంతో అరుణ "ఒక్కటైనా ప్రేమగా చెప్పు" అనేసరికి పడీపడీ నవ్వేసాడు. ఇద్దరిలో ఎవరు డామినేటింగ్ అని హోస్ట్ అడిగేసరికి ఆది అని చెప్పింది అరుణ. "గొడవ జరిగితే ఎవరు ముందు సారీ చెప్తారు" అని అడిగేసరికి "నేను" అని చెప్పింది అరుణ కాదు నేను అన్నాడు ఆది. "ఐతే లాస్ట్ సారీ ఎప్పుడు చెప్పారో చెప్పండి" అని ఆదిని అడిగేసరికి ఆన్సర్ చెప్పలేకపోయాడు.

షో స్టార్టింగ్ లో మీరిద్దరూ ఏదో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారనిపిస్తోంది..అందుకే నన్ను ఇలా ఆడుకుంటున్నారని అన్నాడు ఆది సరదాగా.. మ్యారేజ్ ఐన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా లైఫ్ జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని లైఫ్ గురించి కామెంట్ చేసాడు ఆది. తర్వాత ఆది, అరుణ ఇద్దరూ కలిసి స్టేజి మీద దండలు మార్చుకున్నారు. "నిజంగా బంగారం" అని ఆదిని మెచ్చుకుంది అరుణ. అలా లాస్ట్ లో ప్రేమగా "ఐ లవ్ మై వైఫ్" అని చెప్పాడు. ఈ షో 25 వ తేదీన ఈటీవీలో ప్రసారం కాబోతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.