English | Telugu

మెగా ట్రీట్.. 'ఓజీ' లాంటి సినిమాలో చిరంజీవి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'ఓజీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'ఓజీ' చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్టార్డంకి తగ్గట్టుగా ఈ తరహా గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ చేస్తే చూడాలని వారు ఆశపడుతున్నారు. అయితే త్వరలోనే మెగా ఫ్యాన్స్ ఆశ నెరవేరేలా ఉంది.

చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఇవి కాకుండా బాబీ కొల్లి డైరెక్షన్ లో కూడా ఓ ప్రాజెక్ట్ కమిటై ఉన్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది. ఆ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా మలిచాడు బాబీ. అందులో చిరంజీవి కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే భారీ వసూళ్లతో 'వాల్తేరు వీరయ్య' ఘన విజయం సాధించింది.

అయితే ఈసారి బాబీ 'వాల్తేరు వీరయ్య' తరహా ఎంటర్టైనర్ లా కాకుండా.. భారీ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా భారీ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉంటాయట. చిరంజీవి నుంచి 'ఓజీ', 'విక్రమ్', 'జైలర్' తరహా సినిమాలను అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మెగా ఫ్యాన్స్ మెచ్చే సినిమాని రూపొందే పనిలో ప్రస్తుతం బాబీ ఉన్నట్లు సమాచారం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.