English | Telugu

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో నందమూరి మోక్షజ్ఞ!.. పూర్తి వివరాలు ఇవే  

'గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి 'బాలకృష్ణ'(Balakrishna)నటవారసుడు 'మోక్షజ్ఞ'(Mokshagna)సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులతో పాటు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తు వస్తున్నారు. మోక్షజ్ఞ ఎలాంటి సబ్జెట్ లో కనపడతాడనే క్యూరియాసిటీ కూడా వాళ్లందరిలో ఉంది. నందమూరి హీరోలైతే మాత్రం సుదీర్ఘ కాలం నుంచి మాస్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నారు. అంతలా మాస్ ఆడియెన్స్ లో ఇమేజ్ ఉంది. దీంతో అభిమానుల్లో చాలా మంది మోక్షజ్ఞ తన తాత ఎన్టీఆర్(Ntr),నాన్న బాలయ్య, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్(Jr ntr)లెగసి ని కంటిన్యూ చేస్తు, మాస్ సబ్జెట్ తో తెరంగ్రేటం చెయ్యాలని కోరుకుంటున్నారు.

రీసెంట్ గా 'మోక్షజ్ఞ' కి సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంతమైన చిరునవ్వుని చిందిస్తు క్లాస్ లుక్ తో ఉన్నాడు. అభిమానులైతే మోక్షజ్ఞ పిక్ చూస్తుంటే, వింటేజ్ బాలయ్య ని చూసినట్టుగా ఉందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. రీసెంట్ గా ప్రముఖ హీరో 'నారా రోహిత్'(Nara Rohit)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో ఆయన మాట్లాడుతు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ, ఈ ఏడాది చివర్లో లేదా నెక్స్ట్ ఇయర్ మొదట్లో ఉండే అవకాశం ఉంది. ఇటీవల మోక్షజ్ఞ తో మాట్లాడితే స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. సినిమాల కోసం తన లుక్ మార్చుకుంటున్నాడు. గతంలో లుక్ కంటే ఇప్పుడు పూర్తి మార్పు వచ్చింది. 'ఫీల్ గుడ్ లవ్ స్టోరీ' కోసం ఎదురుచూస్తునట్టుగా చెప్పాడని నారా రోహిత్ తెలిపాడు.


నారా రోహిత్ చెప్పిన ఈ మాటలు వైరల్ గా నిలిచాయి. ఒక వేళ మోక్షజ్ఞ లవ్ సబ్జెట్ చేస్తే దర్శకుడు, హీరోయిన్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అభిమానులు కూడా మోక్షజ్ఞ లవ్ సబ్జెట్ చేసినా, మాస్ అంశాలని ని వదలకుండా ఉండాలని కోరుకుంటున్నారు. బాలకృష గతంలో ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతు ప్రెజంట్ జనరేషన్ కి నచ్చినట్టుగా మోక్షజ్ఞ అన్ని రకాల పాత్రలు చెయ్యాలని చెప్పిన విషయం తెలిసిందే.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.