English | Telugu

ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమంటున్న సినీ కార్మికులు.. ఆందోళనలో చిత్ర పరిశ్రమ!

తమ వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా షూటింగ్స్‌ కూడా ఆగిపోయాయి. వేతనాల పెంపుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ విషయంలో కార్మికులు పట్టు వీడడం లేదు, అలాగే నిర్మాతలు దిగి రావడం లేదు. ఫిలిం ఛాంబర్‌, నిర్మాతల వ్యవహార శైలిపై ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌ వల్లభనేని స్పందించారు.

‘గత ఎనిమిది రోజులుతగా సమ్మె చేస్తున్నాం. ఎవరైతే 30 శాతం వేతనాలు పెంచి ఇస్తున్నారో వారి సినిమాలకే పనిచేస్తున్నాం. ఫిలిం ఛాంబర్‌తో నిన్న జరిగిన చర్చలతో సమస్య పరిష్కారం అయిపోతుందని నమ్మాం. మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మొదట 20 శాతం పెంచండి, ఆ తర్వాత రెండేళ్ళకు 10 పర్సెంట్‌ పెంచండి అని అడిగాము. వాళ్ళు మాత్రం ఏడాదికో పర్సెంటేజ్‌ చెప్పారు. అది కూడా కొన్ని యూనియన్లకు అసలు పెంచం అని చెప్పారు. ఫైటర్స్‌, డాన్సర్స్‌లకు కూడా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు నిర్లిప్తంగా ఉన్నారు. పొట్ట కాలితే వాళ్ళే దారికొస్తారు అనే ధోరణిలో వాళ్లున్నారు. కార్మికులందరి వేతనాలు పెంచాలి. ఇదే మా డిమాండ్‌. ఛాంబర్‌తో చర్చలు జరిపి రెండు రోజుల్లో లేబర్‌ కమిషనర్‌ దగ్గరకు రమ్మన్నారు. ఛాంబర్‌తో చర్చలు సఫలం కాకపోతే సమ్మె కొనసాగుతుంది.

అలాగే విశ్వప్రసాద్‌ ఇచ్చిన నోటీసులపై లీగల్‌గా వెళతాం. ఆయన్నుంచి మాకు 90 లక్షల బకాయిలు రావాల్సి ఉన్నాయి. విశ్వప్రసాద్‌ మాకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మా కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే ఛాంబర్‌కి చెప్పాలి. అంతేగానీ, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. గత ఎనిమిది రోజులుగా చిరంజీవిగారు ఎప్పటికప్పుడు మా వివరాలు తెలుసుకుంటున్నారు. మా కార్మికుల పక్షాన నిలబడిన కోమటిరెడ్డిగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వారిని కలుస్తాం. దీనిలో ప్రభుత్వం జోక్యం కూడా ఉంటే కొన్ని వారు కొన్ని సూచనలు చేస్తారు. ఏదైనా ఛాంబర్‌ నిర్ణయం ఫైనల్‌.ఫ్రభుత్వం జొక్యం అంటే వారి సూచనలు చేస్తారు, ఎదైనా ఛాంబర్‌ డెషిషనే ఫైనల్‌. మా వేతనాల పెంపు విషయంలో మేం చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నాం. మొత్తం 24,000 మంది కార్మికులు ఉన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫిలిం ఛాంబర్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నాం. పిలుపొస్తే వెళ్లి మాట్లాడతాం’ అన్నారు అనిల్‌ వల్లభనేని.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.