English | Telugu

అల్లు అర్జున్‌కి అవమానం.. బన్నీ ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య మళ్లీ వార్‌!

గత కొన్ని సంవత్సరాలుగా అల్లు అర్జున్‌ లుక్‌ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప రిలీజ్‌ ముందు నుంచి ఇప్పటివరకు గడ్డంతోనే ఉంటున్నాడు. అలాంటిది ఒక్కసారిగా లుక్‌ మారిపోయింది. ప్రస్తుతం అట్లీ కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం బన్నీ లుక్‌ పూర్తిగా మార్చేశాడు అట్లీ. పుష్పకు ముందు ఎలా ఉండేవాడో.. మళ్ళీ ఆ లుక్‌ తీసుకొచ్చాడు. ఇప్పుడా లుక్‌ వల్ల అల్లు అర్జున్‌కి ఘోరమైన అవమానం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మెగా ఫ్యాన్స్‌, బన్నీ ఫ్యాన్స్‌ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. అల్లు అర్జున్‌కి అవమానం జరిగితే ఫ్యాన్స్‌ ఎందుకు యుద్ధానికి దిగారు అనే విషయం తెలుసుకుందాం.

అట్లీ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాకి సంబంధించిన షూటింగ్‌ కోసం గత నెల ముంబాయి వెళ్లాడు బన్నీ. తన షెడ్యూల్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌ రిటర్న్‌ అయ్యారు. ముంబాయి విమానాశ్రయంలోకి మాస్క్‌తో వచ్చారు అల్లు అర్జున్‌. సెక్యూరిటీ చెక్‌లో భాగంగా బన్నీని మాస్క్‌ తియ్యమన్నారు. బన్నీతో వున్న వ్యక్తి అతను అల్లు అర్జున్‌ అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, సెక్యూరిటీ ఆఫీసర్‌ మాత్రం ఫేస్‌ చూపించాలని అడిగారు. తప్పని పరిస్థితిలో బన్నీ తన మాస్క్‌ తీసి ఫేస్‌ చూపించారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఒక హీరోని గుర్తు పట్టలేకపోయారు.. అల్లు అర్జున్‌ పరువు పోయిందిగా’, ‘మాస్క్‌ ఎందుకు పెట్టుకున్నట్టు.. ఏమైనా జబ్బులు ఉన్నాయా’, ‘వాళ్ళ డ్యూటీ వాళ్లు చేస్తున్నారు.. ఎందుకంత బిల్డప్‌’, ‘అల్లు అర్జున్‌కి పొగరు ఏమాత్రం తగ్గలేదు’.. కామెంట్స్‌ వస్తున్నాయి. వాళ్ళంతా మెగా ఫ్యాన్స్‌ అని అర్థమవుతూనే ఉంది. ‘మాస్క్‌ ఉంటే ఎవరినైనా గుర్తు పట్టడం కష్టం.. అందులో పరువుపోయేది ఏముంది?’, ‘సెక్యూరిటీకి సహకరించడం తప్పు ఎలా అవుతుంది అంటూ బన్నీ ఫ్యాన్స్‌ రిప్లయ్‌ ఇస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.