English | Telugu

'పుష్ప-2' నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ 'పుష్ప: ది రూల్' గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది హాట్‌టాపికే. పుష్పగా ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ నటనకు, బ్రిలియంట్ డైరెక్టెర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సన్సేషన్ కాంబోలో రాబోతున్న పుష్ప-2కు సంబంధించి ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వేర్‌ ఈజ్ పుష్ప, హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ వీడియోకు, ఐకాన్‌ స్టార్ లుక్‌కు వచ్చిన అనూహ్యమైన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా పుష్ప-2 గురించి మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

పుష్ప చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరిని ఎంతగానో అలరించింది. పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగంతి తెలిసిందే. పుష్ప-2లో కూడా ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే. గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవి ప్రాంతంలో ఫహద్ ఫాజిల్‌పై ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది.

ఫహద్ ఫాజిల్‌కు సంబంధించిన సన్నివేశాల్ని తాజా షెడ్యూల్‌లో పూర్తి చేశామని చిత్రబృందం తెలియజేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకుమార్, ఫహద్ ఫాజిల్ సెట్‌లో ఉన్నప్పటి వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. దీనికి "భన్వర్‌సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాజిల్‌ తాలూకు ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు" అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ కలయికలో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.