English | Telugu

జూలై 4న వరల్డ్‌వైడ్‌గా వెంకటేష్‌ ‘దృశ్యం’

మలయాళంలో సూపర్‌ డూపర్‌హిట్‌ అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా మూవీ మొఘల్‌ డా॥ డి.రామానాయుడు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, రాజ్‌కుమార్‌ థియేటర్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై సీనియర్‌ హీరోయిన్‌ శ్రీప్రియ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వెంకటేష్‌, మీనా జంటగా గతంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. కొంత గ్యాప్‌ తర్వాత వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో ఇది మరో మంచి చిత్రం అవుతుంది. ఈ చిత్రంలో రాంబాబు అనే సింపుల్‌ రోల్‌ చేశాను. ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడు సంగతులు జరుగుతుంటాయి. నచ్చని విషయాలతో ఓ సాధారణ వ్యక్తి ఎలా పోరాడాడు అనేది చిత్ర కథ. శ్రీప్రియగారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.