English | Telugu

పేరేమో 'డబుల్' ఇస్మార్ట్.. పెయిరేమో 'సింగిల్' బ్యూటీ.. పూరీ సార్ ఏంటిది?

'ఇస్మార్ట్ శంకర్'.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి మాస్ లో మాంచి ఇమేజ్ తెచ్చిన మసాలా మూవీ. ఇందులో డబుల్ ధిమాక్ పోరగాడు శంకర్ గా, ఉస్తాద్ గా భలేగా ఎంటర్టైన్ చేశాడు రామ్. అలాగే అతనికి జోడీగా చిందులేసిన నభా నటేశ్, నిధి అగర్వాల్ కూడా మస్త్ వినోదాన్ని పంచారు. ఇక డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇదిలా ఉంటే, దాదాపు ఐదేళ్ళ తరువాత 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' పేరుతో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ చిత్రంలో రామ్ కథానాయకుడుగా కొనసాగుతుండగా.. నభా, నిధి మాత్రం మిస్ అవుతున్నారు. అయితే, ఇందులో వారిద్దరికి బదులుగా ఓ బాలీవుడ్ హీరోయిన్ సందడి చేయనుందని సమాచారం. ఆమె.. మరెవరో కాదు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. త్వరలోనే 'డబుల్ ఇస్మార్ట్'లో సారా ఎంట్రీపై క్లారిటీ రానుంది.

కాగా, పేరులో 'డబుల్' ఇస్మార్ట్అని ఉన్నా.. 'ఇస్మార్ట్ శంకర్'లో మాదిరిగా ఇద్దరు నాయికలు కాకుండా హీరోకి పెయిర్ గా కేవలం సింగిల్ బ్యూటీనే ఎంటర్టైన్ చేయనుందనే వార్తలు చూసి.. "పూరీ సార్ ఏంటిది?" అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. 2024 మార్చి 8న 'డబుల్ ఇస్మార్ట్' తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.