English | Telugu

విష్ణుకి సెన్సార్ కష్టాలు

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లో "దొబ్బెయ్" అనే పదం ఉన్నందువల్ల ఈ చిత్రానికి "యూ" సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు ధనలక్ష్మి అన్నారట. ఇది అన్యాయం అని హీరో విష్ణు నిలదీసినప్పటికి, ధనలక్ష్మి నుంచి ఎలాంటి సమాధానం రాలేదంట. దాంతో మొదటిసారిగా ఈ చిత్ర ట్రైలర్ ను రివ్యూ కమిటికి పంపించడం జరిగింది.మరి ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వబోతుందో మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.