English | Telugu

మళ్ళీ పాత దారిలో దర్శక, నిర్మాత తేజ

మళ్ళీ పాత దారిలో దర్శక, నిర్మాత తేజ పయనించనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఉదయ కిరణ్ హీరోగా, రీమా సేన్ జంటగా నటించిన "చిత్రం" ద్వారా దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ తేజ ఆ తర్వాత "నువ్వు-నేను, జయం" వంటి చక్కని హిట్ చిత్రాలను అందించాడు. కానీ ఈ మధ్య అతనికి ఒక్క సినిమా కూడా హిట్‍ రాలేదు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ పతాకంపై, అందరూ కొత్తవారే నటించబోతుండగా, ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకి తేజ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

ఒకప్పుడు "చిత్రం" సినిమాలో కూడా అందరినీ కొత్తవారినే తీసుకున్నాడు దర్శకుడు తేజ. కానీ ఆ తర్వాత తన బాణీ మార్చుకుని కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా ఆ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం ద్వారా అందరూ కొత్తవారినే ఎన్నుకుంటున్నాడు తేజ. స్వధర్మమే ఆదర్శం అని గీతాచార్యుడు చెప్పినట్టు తనపంధానే నమ్ముకున్నాడు తేజ.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.