English | Telugu

మళ్ళీ పాత దారిలో దర్శక, నిర్మాత తేజ

మళ్ళీ పాత దారిలో దర్శక, నిర్మాత తేజ పయనించనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఉదయ కిరణ్ హీరోగా, రీమా సేన్ జంటగా నటించిన "చిత్రం" ద్వారా దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ తేజ ఆ తర్వాత "నువ్వు-నేను, జయం" వంటి చక్కని హిట్ చిత్రాలను అందించాడు. కానీ ఈ మధ్య అతనికి ఒక్క సినిమా కూడా హిట్‍ రాలేదు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ పతాకంపై, అందరూ కొత్తవారే నటించబోతుండగా, ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకి తేజ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

ఒకప్పుడు "చిత్రం" సినిమాలో కూడా అందరినీ కొత్తవారినే తీసుకున్నాడు దర్శకుడు తేజ. కానీ ఆ తర్వాత తన బాణీ మార్చుకుని కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించినా ఆ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం ద్వారా అందరూ కొత్తవారినే ఎన్నుకుంటున్నాడు తేజ. స్వధర్మమే ఆదర్శం అని గీతాచార్యుడు చెప్పినట్టు తనపంధానే నమ్ముకున్నాడు తేజ.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.