English | Telugu

సాయికిరణ్ అడివితో దిల్ రాజు చిత్రం

సాయికిరణ్ అడివితో దిల్ రాజు చిత్రం నిర్మించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే దిల్ రాజు తన కున్న రెండు బ్యానర్లలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సహజంగానే అన్నీ పెద్ద సినిమాలు నిర్మిస్తుంటాడు. ఏదైనా చిన్న సినిమా తీయాల్సి వస్తే మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తీస్తుంటాడు.

కానీ సాయికిరణ్ అడివితో ఈసారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఒక సినిమా నిర్మించటానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అందరూ కొత్తవారే నటిస్తారని తెలిసింది. సాయికిరణ్ అడివి గతంలో కృష్ణుడు హీరోగా, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి చక్కని చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతా కొత్తవారే నటించబోయే ఈ చిత్రం 2012లో ప్రారంభం కానుందని సమాచారం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.