English | Telugu

సినీ పరిశ్రమలో విభేదాలు లేవు: దాసరి

ఆంధ్రప్రదేశ్‌లో హుద్‌హుద్‌ తుపాను కారణంగా జరిగిన విధ్వంసంపై స్పందించి ‘మేముసైతం’ అంటూ సినీ పరిశ్రమ తరఫున బాధితులను ఆదుకునేందుకు మునుపెన్పడూ లేనంత భారీస్థాయిలో కార్యక్రమం నిర్వహిస్తోన్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా దాసరి నారాయణ రావు మాట్లాడుతూ..సినీ పరిశ్రమలో విభేదాలున్నాయనీ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. వెండితెర వున్నంతకాలం తెలుగు సినీ పరిశ్రమ ఒక్కటిగానే వుంటుందని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించేవారనీ, వారి తర్వాత ఇప్పటి తరం కూడా అదే దారిలో నడుస్తోందని దాసరి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎప్పుడెలాంటి కష్టం వచ్చినా చిత్ర పరిశ్రమ స్పందిస్తుందనడానికి ‘మేముసైతం’ ఓ నిదర్శనమని అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.